AKP: ఎస్ రాయవరంలో కొత్తగా నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఆదివారం ప్రారంభించారు. అలాగే అయ్యప్ప స్వామి, గణపతి, సుబ్రమణ్య స్వామి, తదితర దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్టించారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, శబరిమలై ఆలయ పూజారి రిజ్ కుమార్ పాల్గొని అయ్యప్ప స్వామికి పూజలు చేశారు. భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు.