AP: తిరుపతి శేషాచలం అడవుల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జీవకోన సమీపంలోని మొండోడి కోన వద్ద ఆకతాయిలు పెట్టిన మంటలు వేగంగా విస్తరించి, సుమారు రెండు కిలోమీటర్ల మేర పచ్చని చెట్లను బూడిద చేశాయి. అటవీశాఖ కార్యాలయానికి సమీపంలోనే ఈ ఘటన జరిగింది. ఎర్రచందనం గోదాముల వరకు మంటలు వ్యాపించడంతో అధికారులు అప్రమత్తమై అదుపు చేసే చర్యలు చేపట్టారు.