నిజామాబాద్ గోల్ హనుమాన్ శ్రీ జెండా బాలాజీ మందిరాన్ని చంద్రగ్రహణం సందర్భంగా మూసివేశారు. ఉదయం స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ ద్వారాలను మూసివేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాన్ని సంప్రదాయబద్ధంగా శుద్ధి చేసి, భక్తులకు స్వామివారి దర్శనం కల్పించనున్నట్లు ఆలయ ఈవో జీ. వేణు వెల్లడించారు.