ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోషల్ మీడియాలో చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. “ప్రతి ఒక్కడూ దొంగ వెధవేరా.. మంచోడికి చోటు లేదురా” అంటూ పూరీ రాసుకొచ్చాడు. ఈ ఘాటు వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసినవంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. పూరీ మార్క్ డైలాగ్లా ఉన్న ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.