సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో భారత మాజీ దిగ్గజ క్రికెటర్లతో ప్రత్యేక శిక్షణా శిబిరాలను నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, కుంబ్లే వంటి స్టార్ ఆటగాళ్లతో VVS లక్ష్మణ్ ఇప్పటికే చర్చలు జరిపారు. ముఖ్యంగా, యువ ఆఫ్స్పిన్నర్ల కోసం హర్భజన్ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు ప్రత్యేక క్యాంప్ను నిర్వహించే అవకాశం ఉంది.