KDP: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సిద్ధవటం ఎస్సై పోకల హారిక హెచ్చరించారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆమె మాట్లాడుతూ.. మండలంలో కోడి పందేలు, జూదం,పేకాట నిర్వహిస్తే కఠినమైన చర్యలు తప్పవన్నారు. రౌడీ షీటర్లు పల్లెల్లో ప్రశాంతత వాతావరణం ఉండేటట్లు కలిసిమెలిసి ఉండాలన్నారు. అనుమానిత పల్లె ప్రాంతాలపై కొంతమందిపై నిఘా వేసి ఉంచామని తెలిపారు.