HNK: కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానం కేటాయించాలని MSP జాతీయ అధికార ప్రతినిధి మంద కుమార్ అన్నారు. ప్రెస్ క్లబ్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. అత్యధిక జనాభా కలిగిన మాదిగ సామాజిక వర్గానికి సీటును కేటాయించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, మాదిగ కులస్తుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, MSP నేతలు పాల్గొన్నారు.