NDL: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) ఛైర్మన్ సుబ్రాంగ్ షూ బిశ్వాస్ ఇవాళ శ్రీశైలం డ్యామ్ను సందర్శించనున్నారు. డ్యామ్ ప్రస్తుత స్థితిగతులు, అవసరమైన మరమ్మతులను ఆయన స్వయంగా పరిశీలిస్తారు. అనంతరం శ్రీశైలంలోనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. నీటి విడుదల, డ్యామ్ నిర్వహణపై ఈ భేటీలో చర్చించనున్నారు.