VZM: రామకృష్ణ నగర్లో నివాసముంటున్న పేద ప్రజలకు ఇంటి పట్టాలిఇవ్వాలని CPM కార్యదర్శి రెడ్డి శంకర్రావు కోరారు. మంగళవారం TDP జిల్లా కార్యాలయంలో MLA అతిధి గజపతిరాజుకి వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. 25 ఏళ్లగా పాకలలో నివాసం ఉంటున్న వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని GO 30 ప్రకారం పట్టాలు మంజూరు చేసి ఇళ్లు నిర్మాణానికి రూ.5 లక్షలు సహాయం అందించాలన్నారు.