కడప జిల్లాలోని తొండూరు బీసీ హాస్టల్కు చెందిన విద్యార్థి గురు ప్రణీత్ కుమార్ (11) టిప్పర్ ఢీకొనడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జిల్లా ఇంఛార్జ్ మంత్రి ఎస్. సవిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మెరుగైన వైద్యం కోసం తరలిస్తుండగా మార్గమధ్యలోనే బాలుడు మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున పూర్తి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.