AP: విశాఖపట్నం సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీనర్సింహ స్వామి వారి వార్షిక చందనోత్సవం వైభవంగా ముగిసింది. నిజరూపం నుంచి నిత్యరూపంలో స్వామివారు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు దేవస్థానం, స్థానిక ఉన్నతాధికారులతో ఇప్పటికే మంత్రులు వరుసగా సమీక్షలు నిర్వహించిన విషయం విదితమే.