కృష్ణా: గన్నవరం పరిధిలోని రాయ్నగర్లో సోమవారం ఐదుగురు యువ ఇంజినీర్లు కలిసి సరికొత్త టెక్నాలజీ సంస్థను ప్రారంభించారు. ట్రిపుల్ ఐటీ విద్యను పూర్తిచేసిన వీరు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్ల ప్రొపెలర్స్, రోబోటిక్స్ డిజైన్ల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీరి సంకల్పానికి పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.