విద్యార్థులు NCERT పాఠ్యపుస్తకాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. పరీక్షలో సుమారు 90 శాతం కంటే ఎక్కువ ప్రశ్నలు వీటి నుంచే వస్తాయి. డయాగ్రమ్స్, పట్టికలు వదలకుండా నేర్చుకోవాలి. వీటిలోని సమాచారం ఆధారంగా ప్రశ్నలుండవచ్చు. బయాలజీలో స్మార్ట్ స్టడీ టెక్నిక్ను అమలు చేయాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీని కాన్సెప్టుల వారీగా చదవాలి. చదివిన అంశాలను వారం రోజులకొకసారి రివిజన్ చేసుకోవాలి.