TG: ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన ఇళ్ల కూల్చివేతలపై కేరళ CM పినరయి విజయన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఖమ్మంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు “బుల్డోజర్ రాజ్”ను తలపిస్తోందని ఆరోపించారు. వినోబా భావే నేతృత్వంలోని భూదాన్ ఉద్యమంలో భాగంగా భూమి లేని పేదలకు కేటాయించిన ‘వినోబా నగర్’లోని ఇళ్లను కూల్చివేయడం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.