VSP: పెట్టుబడుల పేరిట ప్రభుత్వ భూములను తక్కువ ధరలకు ప్రైవేట్ కంపెనీలకు కేటాయిస్తున్నారని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కెకె రాజు ఆరోపించారు. తర్లువాడలో విలువైన భూమిని 99 పైసలకే సంస్థకు ఇచ్చిన నిర్ణయంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. భూములను బహిరంగ వేలం ద్వారా కేటాయిస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరిగి, నగర అభివృద్ధి వేగవంతం అవుతుందని తెలిపారు.