టీ20 ప్రపంచకప్ సూపర్-8 భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీమిండియా, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఈ పిచ్ బ్యాటింగ్కు అనుకూలిస్తుంది. భారీ స్కోర్లు నమోదు కావొచ్చని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. బౌలర్లకు కూడా కొంత సహకారం లభిస్తుందని ప్రధాన క్యురేటర్ సుజన్ ముఖర్జీ తెలిపాడు. మంచు ప్రభావం ఉంటుందని చెప్పాడు. మ్యాచ్కు ఎలాంటి వర్షం ముప్పు లేదని వెల్లడించాడు.