టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఊహించని షాక్ తగిలింది. స్థలం విషయంలో ధోనీకి జార్ఖండ్ రాష్ట్ర గృహనిర్మాణ బోర్డు తాజాగా నోటీసులు జారీ చేసింది. రాంచీలోని హర్ము ప్రాంతంలో ఉన్న ఆయన నివాస స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ నోటీసులపై 15 రోజుల్లో స్పందించాలని ప్రభుత్వం గడువు ఇచ్చింది.