భారత క్రికెటర్ రింకూ సింగ్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రింకూ తండ్రి ఖచంద్ర సింగ్ తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. యూపీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా కాలేయ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దీంతో వైద్యులు వెంటిలేటర్పై ఉంచి.. చికిత్స అందించారు. కానీ, పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు.