సౌత్ ఆసియా ఫుట్బాల్ ఫెడరేషన్(SAFF) U20 ఛాంపియన్షిప్లో భాగంగా ఇవాళ భారత్, పాక్ తలపడనున్నాయి. సా.4:15 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. టోర్నీలో ఇవాళే తమ తొలి మ్యాచ్ ఆడుతున్న భారత్.. పాక్, బంగ్లాతో కలిసి ‘గ్రూప్-B’లో ఉంది. ఇవాళ్టి మ్యాచ్ గెలిస్తే భారత్ నేరుగా సెమీస్కు చేరే ఛాన్స్ ఉంటుంది. అటు బంగ్లా చేతిలో తొలి పోరు ఓడిన పాక్.. ఇవాళ ఎలా ఆడుతుందో చూడాలి.
RCB ₹16,500Crకు అమ్ముడుపోవడంపై ఆ ఫ్రాంచైజీ మాజీ ఓనర్ విజయ్ మాల్యా హర్షం వ్యక్తంచేశారు. 2008లో RCBని తాను ₹450Crకు తీసుకున్నప్పుడు అంతా విమర్శించి, నవ్వారని గుర్తుచేసుకున్నారు. యువ కోహ్లీని తీసుకోవడం వంటి మరపురాని జ్ఙాపకాలతో RCB తన DNAలో భాగంగా ఉండిపోతుందన్నారు. మాల్యా 2008లో యూనైటెడ్ స్పిరిట్స్(USL) ద్వారా RCBని కొనగా.. 2012లో RCB సహా USLను డియాజియో సొంతంచేసుకుంది.
మహ్మద్ షమీ తనకు అన్నలాంటివాడని భారత పేసర్ ముకేశ్ కుమార్ పేర్కొన్నాడు. బెంగాల్ తరఫున ఇద్దరం కలిసి ఆడామని.. అనుకున్నట్లుగా ఆడలేకపోయినప్పుడు షమీ వద్దకు వెళ్లి సలహా తీసుకుంటానని చెప్పాడు. షమీ చాలా అండగా ఉంటాడని, అతని నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని ముకేష్ చెప్పుకొచ్చాడు. కాగా భారత జట్టులోకి రీఎంట్రీ కోసం ఈ ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు ఎంతో కాలంగా ఎదురుచేస్తున్నారు.
వైట్ బాల్ క్రికెట్లో MS ధోనీ తన కంటే గొప్ప కెప్టెన్ అని దిగ్గజ ప్లేయర్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ధోనీ భారత్కు 2011 వన్డే వరల్డ్ కప్ అందించాడని.. తాను జట్టును 2003 టోర్నీలో రన్నరప్గా మాత్రమే నిలపగలిగానని పేర్కొన్నాడు. తమ కాలంలో T20 WC లేదని, జార్ఖండ్ నుంచి తొలి క్రికెటర్ అయిన ధోనీ.. దిగ్గజంగా ఎదగడం చూసి గర్వపడుతున్నట్లు దాదా తెలిపాడు.
భారత మహిళల జట్టుకు వన్డే వరల్డ్ కప్-2025 విజయంతో ప్రపంచంలో ఎక్కడైనా ట్రోఫీలు గెలవగలమనే నమ్మకాన్ని ఇచ్చిందని కెప్టెన్ హర్మన్ పేర్కొంది. ఆ విజయం తర్వాత అభిమానులు, మీడియా తదితరుల నుంచి తమకు దక్కిన గుర్తింపే వేరని తెలిపింది. ఈ ఏడాది జరిగే T20 WCలోనూ టైటిల్ కోసం శ్రమిస్తామని చెప్పింది. కాగా ఇంగ్లండ్-వేల్స్ వేదికగా జూన్ 12-జూలై 5 మధ్య మహిళల పొట్టి మెగా టోర్నీ జరగనుంది.
ధురంధర్-2 దెబ్బకు పాక్లో భారత గూఢచరుల కోసం పలుచోట్ల పోలీసులు తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మాట్లాడుతూ.. ‘మూవీ చూశాక ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి. ఎదుటివారు ఇండియన్ ఏజెంట్ ఏమోననే అనుమానంతో జాగ్రత్తగా మాట్లాడుతున్నా. దీనిపై దేశ ప్రభుత్వం చర్యలు తీసుకుని బెగ్గర్స్ మొదలు అందరినీ విచారించాలి’ అని పేర్కొన్నాడు.
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను ఎక్కువ మంది IPL కెప్టెన్లు వ్యతిరేకించారు. నిన్నటి కెప్టెన్ల మీట్లో విస్తృత చర్చ జరగ్గా.. దీనిపై IPL 2027 తర్వాతే సమీక్ష ఉంటుందని BCCI వర్గాలు వాళ్లతో చెప్పాయట. రెండేళ్ల క్రితమే దీన్ని రోహిత్ వ్యతిరేకించగా.. ఇటీవల కాలంలో కోహ్లీ, అక్షర్ తదితరులూ అదే మాట పలికారు. ఈ రూల్ వల్ల జట్టులో ఆల్రౌండర్ల ప్రాధాన్యం తగ్గుతుందనే ఆందోళన నెలకొంది.
PSL-2026 కెప్టెన్ల ప్రెస్మీట్లో ఆసీస్ మాజీ ప్లేయర్, కరాచీ కింగ్స్ సారథి అసహనం వ్యక్తం చేశాడు. తోటి కెప్టెన్లు లబుషేన్, సౌద్ షకీల్, అఫ్రిది నవ్వుతూ ఏదో చర్చించుకుంటున్నారు. దీనిపై ‘ఏమైంది జెంటిల్మెన్? సారీ.. ఇక్కడ స్కూల్ పిల్లలు ఉన్నారు’ అని సెటైరికల్గా వారిని మందలించాడు. కాగా చమురు కొరత నేపథ్యంలో PSL ఫ్యాన్స్ లేకుండా 2 స్టేడియాల్లోనే జరగనుంది.
భారత జట్టులోకి పునరాగమనం చేయడం కోసమే తాను ఇంతలా కష్టపడుతున్నానని పృథ్వీ షా స్పష్టం చేశాడు. ‘గతంలో కంటే ఇప్పుడు మూడు రెట్లు ఎక్కువ శ్రమిస్తున్నాను. జట్టులోకి తిరిగి రావడానికి 200 శాతం కష్టపడుతున్నాను. నా తప్పులేమిటో నాకు తెలుసు. వాటిని ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. మనకు మనమే అర్థం చేసుకుని ముందుకు సాగాలి’ అని వ్యాఖ్యానించాడు.
IPL- 2026 సీజన్కు ముందు KKR జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గాయం కారణంగా టోర్నీకి దూరమైన స్టార్ పేసర్ హర్షిత్ రాణా స్థానాన్ని నవ్దీప్ సైనీతో భర్తీ చేశారు. ఇప్పటికే ఆకాశ్ దీప్ స్థానంలో సౌరభ్ దూబే జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. KKR బౌలింగ్ విభాగం ప్రస్తుతం పతిరణ, ఉమ్రాన్ మాలిక్, బ్లెస్సింగ్ ముజరబానీ, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగిలో బలంగా కనిపిస్తోంది.
IPL-2026 ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మొత్తం 10 జట్ల కెప్టెన్లు ట్రోఫీతో ఫొటోలు దిగారు. అయ్యర్ (PBKS), గిల్ (GT), పంత్ (LSG), రుతురాజ్ (CSK), అక్షర్ పటేల్ (DC), పటీదార్ (RCB), రహానే (KKR), పాండ్యా (MI), ఇషాన్ కిషన్ (SRH), పరాగ్ (RR) తమ తమ జట్లకు సారథ్యం వహిస్తున్నారు. IPL చరిత్రలో తొలిసారిగా అన్ని జట్లకూ భారత ఆటగాళ్లే కెప్టెన్లుగా వ్యవహరిస్తుండటం విశేషం.
పాక్ ప్లేయర్లు PSLను IPLతో పోలుస్తూ ఉంటారు. అయితే, RCB (రూ.16,700 కోట్లు), RR (రూ.15,290 కోట్లు) వంటి ఒక్కో IPL జట్టు విలువ వేల కోట్లలో ఉంది. PSL లీగ్ మొత్తం విలువ కేవలం రూ.3,000 కోట్లు మాత్రమే. దీంతో భారత నెటిజన్లు, కేవలం ఒక్క IPL జట్టును అమ్మితే పాక్ క్రికెట్ బోర్డు(రూ.450-580 కోట్లు)తో పాటు వారి మొత్తం లీగ్ను కూడా కొనుగోలు చేయవచ్చని కామెంట్లు చేస్తున్నారు.
అశ్విన్పై యువరాజ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ ఫైర్ అయ్యాడు. LSG జట్టులో ఉన్న సచిన్ తనయుడు అర్జున్కు తుది జట్టులో చోటు దక్కదని అశ్విన్ అన్నాడు. దీనిపై యోగ్రాజ్ స్పందిస్తూ.. ‘అర్జున్కు చోటు దక్కదనడానికి నువ్వు ఎవరు? నీకున్న అర్హత ఏంటి? సచిన్ కొడుకుగా అర్జున్పై ఇప్పటికే తీవ్ర ఒత్తిడి ఉంది. ఇలాంటి మాటలు అతడిపై మరింత ఒత్తిడిని పెంచుతాయి’ అని అన్నాడు.
IPL-2026 సీజన్లో భాగంగా ఏప్రిల్ 5న మ.3:30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో SRH, LSG జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు సంబంధించిన టికెట్ల అమ్మకాలు రేపు సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్నాయని SRH యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ‘District by Zomato’ యాప్ ద్వారా ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ప్రతి రెండు టికెట్ల కొనుగోలుపై ఒక SRH జెర్సీని ఉచితంగా పొందవచ్చు.