ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత మహిళా జట్టు ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 100 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ కేవలం 16.2 ఓవర్లలోనే ఐదు వికెట్లను కోల్పోయి విజయం సాధించింది. భారత బౌలర్లలో రేణుకా ఠాకూర్ 3, ప్రియా మిశ్రా 2 వికెట్లు తీశారు.
భారత మహిళల జట్టుతో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా మహిళల జట్టు గెలుపొందింది. 101 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఆసీస్ 16.2 ఓవర్లకే 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేదించింది. జార్జియా వోల్ (46*), లిచ్ఫీల్డ్ 35 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రేణుకా ఠాకూర్ సింగ్ 3 వికెట్లు, ప్రియా మిశ్రా 2 వికెట్లు పడగొట్టారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మొదటి మ్యాచ్కు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో.. కేఎల్ రాహుల్ ఓపెనర్గా దిగాడు. దీంతో అతను సక్సెస్ కావడంతో.. రోహిత్ బ్యాటింగ్ స్థానంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్పందించిన రోహిత్ శర్మ.. రాహుల్ ఓపెనర్గా వస్తాడని.. తాను మిడిలార్డర్లో బ్యాటింగ్ చేస్తానని వెల్లడించాడు. బ్యాటర్గా ఇది తనకు అంత ఈజీ కాదని.. కానీ, జట్టుకు ఇదే బెస్ట్ ఆప...
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫిట్నెస్పై ఆయన సతీమణి అనుష్క ఆసక్తికర వాఖ్యలు చేశారు. ‘నిజాయితీగా చెబుతున్నా.. అతడు ఆరోగ్యం, ఫిట్నెస్ విషయంలో కఠినంగా ఉంటాడు. ఉదయాన్నే కచ్చితంగా నిద్రలేచి వ్యాయామం చేస్తాడు. జంక్పుడ్, చక్కెర పానీయాలకు దూరంగా ఉంటాడు. చికెన్ తిని 10 ఏళ్లు అవుతుంది అంటే నమ్ముతారా?. నిద్ర, విశ్రాంతి విషయంలో అసలు రాజీ పడడు. అత్యుత్తమ స్థాయిలో రాణించడానికి ...
NZB: ఆర్మూర్ ఉన్నత పాఠశాలకు చెందిన భానుశ్రీ రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పీడీ బొజ్జ మల్లేష్ గౌడ్ తెలిపారు. గత నెలలో సుద్ధపల్లి గురుకుల పాఠశాలలో జరిగిన పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర పోటీలకు ఎంపికైంది. ఈ నెల 7 నుంచి 9 వరకు ఆర్మూర్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు తరపున ఆడనుంది.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మరో రికార్డ్ నమోదైంది. సిక్కింతో మ్యాచ్లో బరోడా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీ20 చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్. భాను పూనియా 51 బంతుల్లో 134 రన్స్తో ఊచకోత కోశాడు. అతడి ఇన్నింగ్స్లో 15 సిక్సర్లు, 5 ఫోర్లున్నాయి. శివాలిక్ శర్మ 55, అభిమన్యు సింగ్ 53, సోలంకి 50 రన్స్తో రాణించారు.
NLG: నల్గొండ జిల్లాకు చెందిన యువతి నిజానపల్లి రమ్య సైక్లింగ్లో జాతీయస్థాయిలో రాణిస్తుంది. ఇప్పటికే పలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటింది. తమది పేద కుటుంబమని, దాతలు ఎవరైనా ట్రాక్ సైకిల్ బహుకరించి ప్రోత్సహిస్తే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటానని వెల్లడించింది.
MDK: రామాయంపేటలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నిర్వహించనున్న సీఎం కప్ పోటీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రామాయంపేట తహసీల్దార్ రజని, ఎంపీడీవో షాజీలోద్దీన్ సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో పాల్గొనే వారు ఈ నెల 6లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 9963643876 సంప్రదించాలని సూచించారు.
WGL: వరంగల్ సుందరయ్య నగర్కి చెందిన యాట చందన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అండర్ 19 బాక్సింగ్ కాంపిటీషన్లో గోల్డ్ మెడల్ సాధించి నేషనల్కు ఎంపికైంది. ఈ సందర్భంగ బుధవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుని కలవడం జరిగింది. పోటీలకు వెళ్లేందుకు క్రీడా సామాగ్రితో పాటు నా వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
KNL: అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో కర్నూలు మండలం గార్గేయపురం ZPH పాఠశాల విద్యార్థి ఫర్హానా మంచి ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయిందని హెచ్ఎం వెంకట్రావు తెలిపారు. బుధవారం పాఠశాలలో జరిగిన అభినందన సభలో రాయలసీమ యునివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడు రెడ్డిపోగు ప్రశంత్తో కలిసి ఆయన ఫర్హానను అభినందించారు.
జూనియర్ పురుషుల జట్టు ఆసియాకప్ హాకీ టోర్నమెంట్ విజేతగా భారత్ నిలిచింది. టోర్నీ మొత్తం నిలకడైన ప్రదర్శన కనబర్చిన భారత జట్టు ఫైనల్లో 5-3 తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తుచేసి టైటిల్ కైవసం చేసుకుంది. దీంతో వరుసగా మూడోసారి జూనియర్ ఆసియాకప్ను భారత్ కైవసం చేసుకుంది.
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్మాన్ ధరించిన ‘బ్యాగీ గ్రీన్’ క్యాప్కు వేలంలో భారీ ధర పలికింది. 1947-48లో భారత్తో జరిగిన సిరీస్లో అతడు ధరించిన ‘బ్యాగీ గ్రీన్’ క్యాప్ సుమారు రూ.2.63 కోట్లకు అమ్ముడుపోయింది. కాగా, స్వదేశంలో బ్రాడ్మన్కు అదే చివరి సిరీస్. ఐదు టెస్టుల ఈ పోరులో 4 సెంచరీలు సహా 715 పరుగులు సాధించాడు. ప్రస్తుతం R...
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో భారత యువ గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్, డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ మధ్య ఎనిమిదో గేమ్ డ్రా అయింది. ప్రపంచ టైటిల్ మ్యాచ్లో ఇప్పటి వరకు ఎనిమిది గేమ్లు జరగ్గా ఆరు డ్రా అయ్యాయి. కాగా.. ఎనిమిది రౌండ్లు పూర్తయ్యే సరికి 4-4 పాయింట్లతో గుకేశ్, లిరెన్ సమానంగా ఉన్నారు.
HYD: హుస్సేన్సాగర్ వెళ్లేవారు ఇక ఫుల్ ఎంజాయ్ చేసేయొచ్చు. అమరావతి బోటింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ స్పోర్ట్స్ను మంత్రి జూపల్లి, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డితో కలిసి బుధవారం ప్రారంభించారు. హుస్సేన్సాగర్లో జెట్ స్కీపై సరదాగా విహరించారు. కొత్తగా వాటర్ రోలర్, జెట్ అటాక్, కాయక్ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
టీమిండియా మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత జట్టు ఆసీస్తో రెండో టెస్టు కోసం అడిలైడ్లో ప్రాక్టీస్ చేస్తోంది. అయితే ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తుండగా వందలాది ప్రేక్షకులు స్టేడియానికి వచ్చారు. ఈ క్రమంలో ఆసీస్ అభిమానులు భారత ఆటగాళ్లను ఎగతాళి చేశారు. దీంతో ఈ టూర్లో భారత ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్స్ సమయంలో అభిమానులను అనుమతించొద్దని టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయించింది.