18 ఏళ్లకే ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచి గుకేష్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గుకేష్కు కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. ‘గుకేష్ యావత్ భారతదేశం గర్వపడేలా చేసారు. కేవలం 18 ఏళ్ల వయస్సులో అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ చెస్ ఛాంపియన్గా అవతరించడం ఒక అద్భుతమైన విజయం. మీ విజయం దృఢ సంకల్పంతో ఏదైనా సాధ్యమని మాకు గుర్తు చేస్తుంది. అభినంద...
MNCL: కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన కొత్తూరి ప్రణయ్ ట్రిపుల్ జంప్లో కాంస్య పతకం సాధించాడు. డిసెంబర్ 7,8,9,19,11 తేదీల్లో భువనేశ్వర్లో జరిగిన 39వ జూనియర్ జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్-2024 పోటీల్లో ట్రిపుల్ జంప్(15.6Mtrs)లో అత్యంత ప్రతిభ కనబరిచి తెలంగాణ రాష్ట్రానికి కాంస్య పతకం సాధించాడు.
18 ఏళ్లకే ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్గా నిలిచి తెలుగు కుర్రాడు గుకేశ్ చరిత్ర సృష్టించాడు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు గ్రాండ్మాస్టర్ గుకేశ్కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గుకేశ్ అద్భుతమైన విజయాన్ని దేశం మొత్తం వేడుక చేసుకుంటోందని, భవిష్యత్తులో మరెన్నో విజయాలు, ప్రశంసలు పొందాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా దొమ్మరాజు గుకేశ్(18) నిలిచాడు. ఈ సందర్భంగా గూకేష్ మాట్లాడుతూ.. ‘ఈ క్షణం కోసం నేను పదేళ్లుగా కలలు కన్నాను. అది నెరవేరినందుకు సంతోషంగా ఉంది. నేను విజయాన్ని ఊహించలేదు, అందుకే కాస్త భావోద్వేగానికి లోనయ్యాను. నా దృష్టిలో లిరెన్ నిజమైన ప్రపంచ ఛాంపియన్.. అతడికి ధన్యవాదాలు’ అని తెలిపాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కల్లినన్ విమర్శలు చేశాడు. రోహిత్ కేవలం ఫ్లాట్ వికెట్లపైనే ఆడతాడని.. ఎందుకంటే అతడు ఫిట్గా కనిపించడం లేదని కల్లినన్ ఆరోపించాడు. అధిక బరువుతో సతమతం అవుతున్న కారణంగా అతడు స్వదేశంలో హీరో.. విదేశాల్లో జీరో అని ఎద్దేవా చేశాడు.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో భారత్ గెలుపొందగా.. రెండో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్ 1-1తో సమం అయింది. డిసెంబరు 14 నుంచి గబ్బా స్టేడియంలో మూడో టెస్టు ప్రారంభంకానుంది. అయితే గబ్బా టెస్టులో ఏ జట్టు గెలిస్తే ఆ టీమ్ సిరీస్ను కైవసం చేసుకుంటుందని భావిస్తున్నానని భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి అన్నారు. ఇందులో తనకేలాంటి సందేహం లేద...
ఈనెల 14 నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టులో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ ద్వారా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. ఒకవేళ అతడు సెంచరీ చేస్తే.. ఆస్ట్రేలియాలోని ప్రధాన 5 వేదికల్లో శతకాలు బాదిన మూడో పర్యాటక జట్టు ఆటగాడిగా చరిత్రకెక్కుతాడు. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఈ రికార్డును గవాస్కర్, కుక్ మాత్రమే అందుకున్నారు.
E.G: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో అంతర్ కళాశాలల ఆర్చరీ పోటీలను ఈ రోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్టార్ స్పోర్ట్స్ బోర్డ్ ఛైర్మన్ అయిన ప్రొఫెసర్ జి.సుధాకర్ పాల్గొని పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆర్చరీ క్రీడపై క్రీడాకారులు మక్కువ చూపిస్తున్నారని అన్నారు.
విరాట్ కోహ్లీపై భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆఫ్ స్టంప్ మీద పడిన బంతిని ఆడటంలో కోహ్లీ విఫలమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడి బలహీనత గురించి మహ్మద్ కైఫ్ మాట్లాడాడు. ఒకట్రెండు మ్యాచ్లు ఆడిన బౌలర్లకూ కోహ్లీ ఎలా ఔటవుతాడో తెలుసని పేర్కొన్నాడు.
గబ్బా స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య మూడో టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో భారత్ వ్యూహం మార్చుకోనున్నట్లు తెలుస్తోంది. తొలి రెండు టెస్టుల మాదిరిగానే మూడో టెస్టులోనూ కేఎల్ రాహుల్- జైస్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రాక్టీస్ సెషన్లో ఓపెనర్లు అలాగే బ్యాటింగ్కు వచ్చారు. కాగా, గత మ్యాచ్లో ఆరో డౌన్గా వచ్చిన రోహిత్ శర్మ.. ఈసారి టాప్ ఆర్డర్లో బ్యాటింగ్...
ధోనీపై లక్నో యజమాని సంజీవ్ గోయెంకా ప్రశంసలు కురిపించాడు. అతడితో మాట్లాడిన ప్రతిసారీ ఏదోఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటానని తెలిపాడు. ధోనీ లాంటి నాయకుడిని తాను ఎప్పుడూ చూడలేదని కొనియాడాడు. అతని ఆలోచనా విధానం, ప్రవర్తించే తీరంటే తనకు ఇష్టమని పేర్కొన్నాడు. మతిశా పతిరన లాంటి యువ బౌలర్ను డేంజరస్ మ్యాచ్ విన్నర్గా తీర్చిదిద్దాడని.. తన ఆటగాళ్లను ఎప్పుడు, ఎలా ఉపయోగించుకోవాలో ధోనీకి బాగా తెలుసన...
కోనసీమ: ఉప్పలగుప్తం మండలం ఎస్.యానం గ్రామంలో బీచ్ వాలీబాల్ జరగనున్నాయి. ఈ పోటీల నిమిత్తం గురువారం అమలాపురం ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు పీఈటీ, డీఈఓ, స్పోర్ట్స్ అధికారులు, వాలీబాల్ పోటీల నిర్వహణ కమిటీతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
2025 ఛాంపియన్స్ ట్రోఫీ టీ20 ఫార్మాట్లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టోర్నీని టీ20 ఫార్మాట్లో నిర్వహించాలని ప్రసారకర్తలు ఐసీసీకి ప్రతిపాదించారు. ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించడానికి పాకిస్థాన్ అంగీకరించకపోవడంతో ఐసీసీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేకపోతుంది. దీంతో టోర్నీకి సమయం దగ్గరపడుతున్నందున మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నామని ప్రసారకర్తలు ఐసీసీకి తెలిపారు.
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ కీలక దశకు చేరుకుంది. ఇవాళ చివరి 14వ రౌండ్ జరగనుంది. 13 రౌండ్లు ముగిసే సరికి భారత్ గ్రాండ్మాస్టర్ దొమ్మరాజు గుకేశ్, డింగ్ లిరెన్ చెరో 6.5 పాయింట్లతో సమనంగా ఉన్నారు. ఇవాళ జరిగే ఈ చివరి గేమ్లో గుకేశ్ గెలిస్తే ప్రపంచ ఛాంపియన్గా నిలువనున్నాడు.
భారత క్రికెట్లో ప్రపంచకప్ అనగానే మొదట గుర్తొచ్చే పేరు యువరాజ్ సింగ్. ఇవాళ ఆయన 43వ పుట్టినరోజు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతీసారి బ్యాటుతో పాటు బంతితోనూ ఎన్నో మరపురాని ఇన్నింగ్స్లు ఆడి విజయాన్ని అందించాడు. 2007 T20 వరల్డ్ కప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలవడంలో యువీదే కీలక పాత్ర. ఇక 2007లో ENGపై కొట్టిన 6 బంతుల్లో 6 సిక్సర్లను క్రికెట్ ప్రేమికులు అంత ఈజీగా మర్చిపోరు.