కాకినాడ నగరంలో దోమల సమస్యను అరికట్టేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ NVV సత్యనారాయణ తెలిపారు. మంగళవారం సాయంత్రం కొండయ్యపాలెం ప్రాంతంలో నిర్వహించిన ఫాగింగ్ కార్యక్రమాన్ని ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… నగర వ్యాప్తంగా దోమల నిర్మూలనకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.