NTR: నందిగామలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.వి.సుబ్బారావు మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తే పార్టీ బలోపేతం అవుతుందని అన్నారు. కేంద్ర పథకాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.