గుజరాత్తో మ్యాచ్లో MI జట్టులో మార్పులు చేయాలని అశ్విన్ సూచించాడు. ఈ మ్యాచ్ కోసం శాంట్నర్, ఘజన్ఫర్లను తుది జట్టులోకి తీసుకోవాలన్నాడు. అలాగే, అశ్వని కుమార్ను కూడా ఆడించాలని తెలిపాడు. మరోవైపు, GT జట్టు గ్లెన్ ఫిలిప్స్ను తప్పించి హోల్డర్ను బరిలోకి దించాలని పేర్కొన్నాడు. దీంతో ఇరు జట్ల విజయావకాశాలు మెరుగుపడతాయని వ్యాఖ్యానించాడు.