VSP: జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకుల దాహార్తిని తీర్చేందుకు కేజీహెచ్ ప్రాంగణంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. డైట్ కాంటీన్ ప్రవేశ ద్వారం వద్ద డైట్ కాంట్రాక్టర్ ఎస్. శ్రీనివాసరావు సౌజన్యంతో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణి ప్రారంభించారు.