PPM: కాంగ్రెస్ ఇంఛార్జ్ బత్తిన మోహన్ రావు బీజేపీ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే మహిళా బిల్లును ప్రవేశపెట్టారని, దాంతో పాటు డీలిమిటేషన్ అంశాన్ని తెరపైకి తేవడం ఒక “మాయా క్రీడ” అని ఆయన అభివర్ణించారు. ఈ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు పెను ప్రమాదం పొంచి ఉందని రాహుల్ గాంధీ ముందే గుర్తించారని తెలిపారు.