సత్యసాయి: కేరళలో పర్యటిస్తున్న పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి కొచ్చిన్లోని అమృత సెంటర్ ఫర్ నానోసైన్సెస్ అండ్ మాలిక్యులర్ మెడిసిన్ శాస్త్రవేత్తలతో భేటీ అయ్యారు. డాక్టర్ శాంతికుమార్ నాయర్, డాక్టర్ జయకుమార్ రంగసామి సహా పలువురు నిపుణులతో ఆమె చర్చలు జరిపారు. అక్కడే ఉన్నత చదువులు పూర్తి చేసిన ఎమ్మెల్యే.. పాత పరిచయాలను గుర్తుచేసుకున్నారు.