BPT: స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బల్లికురవ మండలం వైదన గ్రామపంచాయతీలో అధికారులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను నిర్దేశించిన ప్రాంతాల్లోనే వేయాలని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా అధికారులు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ను తనిఖీ చేసి, అక్కడి వసతులను పరిశీలించారు.