AP: పోలండ్లో మృతి చెందిన విశాఖ జిల్లా వాసి ప్రసాద్బాబు(45) మృతదేహాన్ని స్వదేశానికి రప్పించే ప్రక్రియ కొనసాగుతోంది. మృతదేహాన్ని వార్సా నుంచి తుర్కియేలోని ఇస్తాంబుల్ మీదుగా ఆదివారం రాత్రికి HYDకి చేరుకొనుంది. అక్కడి నుంచి విశాఖకు తరలించేందుకు ‘ఓపస్’ ఫ్యునరల్ సర్వీసెస్ సంస్థ కుటుంబ సభ్యులతో కలిసి సమన్వయం చేస్తోంది. కాగా, అనారోగ్యంతో అతడు ఈ నెల 4న మృతి చెందాడు.