PDPL: ఈనెల 20న జగిత్యాలలో నిర్వహించనున్న మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్, మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి పిలుపునిచ్చారు. కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి, సభను దిగ్విజయం చేసేందుకు గ్రామాలవారీగా సమన్వయం చేసుకోవాలని సూచించారు.