VZM: గ్రామీణ ప్రాంత విద్యార్థులు పట్టుదలతో చదివితే అద్భుతాలు సాధిస్తారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రశంసించారు. ఇంటర్ ఫలితాల్లో జిల్లాలోని పెదమేడపల్లి గ్రామానికి చెందిన రెడ్డి తేజస్విని 1000కు 991 మార్కులతో జిల్లా స్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. ఈ సందర్బంగా మంత్రి ఆమెను అభినందించి సన్మానించారు.