KDP: వేముల మండల పరిధిలోని నల్లచెరువుపల్లి సమీపంలో ప్రసిద్ధి చెందిన పురాతన మోపూరు భైరవేశ్వరస్వామి దేవాలయానికి రూ.28.90 లక్షల ఆదాయం వస్తోందని ఆలయ ఈవో రమణ తెలిపారు. ఆలయానికి చెందిన 132.80 ఎకరాల భూముల నుంచి సంవత్సరానికి దాదాపు రూ.1లక్ష ఆదాయం లభిస్తోందన్నారు. అలాగే తలనీలాలు, టెంకాయలు, హుండీ లెక్కింపు ద్వారా సుమారు రూ.22 లక్షల వరకు ఆదాయం వస్తోందని వివరించారు.