ప్రకాశం: ఒంగోలు కేశవరాజుకుంటలోని చెన్నకేశవస్వామి కాలనీలో డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, హుడా ఛైర్మన్ షేక్ రియాజ్ హాజరై, విగ్రహాన్ని ఆవిష్కరించారు.