AP: రాష్ట్రంలోని రాయలసీమలో ఎండలు మండిపోతుండగా, కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఎండ తీవ్రత, పిడుగులతో కూడిన వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. ఇవాళ కాకినాడ, కోనసీమ, తూ.గో. జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. రాయలసీమ జిల్లాల్లో ఎండల ప్రభావం అధికంగా ఉంటుందన్నారు.