పల్నాడు: చిలకలూరిపేట క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ప్రజల వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారంపై అధికారులతో చర్చించారు. ప్రభుత్వం సకాలంలో స్పందిస్తుండటంతో ప్రజల్లో నమ్మకం పెరుగుతోందన్నారు. ప్రజలందరు గ్రీవెన్స్ను వినియోగించుకోవాలన్నారు.