HNK: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్సై రమేష్ నాయక్ అన్నారు. పరకాల మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో ప్రజలకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. అంతకుముందు “నో హెల్మెట్-నో ఎంట్రీ” బోర్డును గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్నారు. గ్రామ సర్పంచ్ రాజేశ్వరరావు, ఉప సర్పంచ్ ప్రవీణ్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.