AP: అనకాపల్లి జిల్లా నక్కపల్లి జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడింది. దీంతో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. పంట కాల్వ గుంతలో బోల్తా పడిన బస్సును క్రేనుల సాయంతో పోలీసులు బయటకు తీశారు. విశాఖ నుంచి ప్రైవేటు ట్రావెల్ బస్సు చెన్నై వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. ప్రమాదం సమయంలో బస్సులో 38 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.