ADB: బోథ్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించనున్న మార్కండేయ స్వామి ఆలయానికి స్థానికులతో కలిసి భూమి పూజ చేశారు. ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యం కావటం ఆనందంగా ఉందన్నారు. గ్రామస్తులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భక్తి మార్గంలో పయనించాలని అనిల్ జాదవ్ పిలుపునిచ్చారు.