BHPL: మాజీ స్పీకర్ శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రకాష్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. అనునిత్యం పేద ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేసే పేదలకు అండగా శ్రీపాదరావు నిలిచారని, శ్రీపాదరావు చూపిన బాటలో నడుస్తూ వారి ఆశయ సాధనకు మనమంతా కృషి చేయాలని ప్రకాష్ రెడ్డి అన్నారు.