సత్యసాయి: పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో ఎన్ఆర్ఈజీఎస్ అధికారులతో మంత్రి సవిత సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో ఇప్పటికే 61 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 73 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయినట్లు ఆమె వెల్లడించారు. అలాగే 220 గోకులం షెడ్లు, 139 నీటి తొట్టీల పనులు విజయవంతంగా ముగిశాయని తెలిపారు. ఈ సమావేశంలో ఎన్ఆర్ఈజీఎస్ పీడీ విజయేంద్రప్రసాద్ పాల్గొన్నారు.