కోనసీమ: మండపేట(M) ద్వారపూడి మహాత్మా గాంధీ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు సంయుక్తంగా శనివారం గ్రామ వీధుల్లో బడి పిలుస్తోంది రా కార్యక్రమం నిర్వహించారు. బడి ఈడు పిల్లలందరూ తప్పనిసరిగా చదువుకోవాలని ప్రైవేటు చదువులు వద్దు ప్రభుత్వ చదువులే ముద్దు,పెద్దలు పనికి – పిల్లలు బడికి అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.