W.G: యువతను ప్రభావితం చేసే విధంగా గంజాయి, డ్రగ్స్ వంటి వాటికి దూరంగా ఉండేందుకు వాటి వైపు యువత మరలకుండా క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. తణుకు నియోజకవర్గంలో ఎన్టీఆర్ క్రికెట్ టోర్నమెంట్ మూడో దశ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇవాళ తణుకు కూటమి కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు.