E.G: నిడదవోలులోని కోరుపల్లి గ్రామంలోని రైతు సేవ కేంద్రంలో శనివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ అధ్యక్షుడు కారింకి రామకృష్ణ వరప్రసాద్ ప్రారంభించారు. ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి వారికి మద్దతుగా నిలుస్తోందని తెలిపారు. రైతులు ఆర్థికంగా బలపడితేనే గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కూటమి నాయకులు, RSK సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.