VZM: శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ శుక్రవారం గరివిడిలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక YCP క్యాంపు కార్యాలయంలో 4 మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఒకొక్కరితో మాట్లాడి వారి సమస్యలు, బాగోగులు తెలుసుకున్నారు. అనంతరం గ్రామాల్లో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని, ప్రజా సమస్యలు గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.