ప్రకాశం: మార్కాపురం కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.