AKP: అచ్యుతాపురం మండలం జగ్గయ్యపేటలో సోమవారం ఉపాధి హామీ పథకం పనులను ప్రారంభించారు. ఏపీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు పంట కాలవల మరమ్మత్తు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. మొదటి రోజు 200 మంది వేతన దారులు పనులకు హాజరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆడారి సాంబశివరావు, ఎం. రమణబాబు పాల్గొన్నారు.