SRD: కంగ్టి మండలం చాప్ట కేలో సోమవారం ప్రతి ఇంటి ఆడపడుచులందరికీ చీరలు పంపిణీ చేశారు. స్థానికంగా నిర్మించిన మహాత్మా బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం ఈ నెల 19న నిర్వహిస్తున్నందున ప్రతి ఇంటి ఆడపడుచులను ఆహ్వానిస్తూ చీరలను పంపిణీ చేసినట్లు గ్రామ నిర్వాహకులు తెలిపారు. విగ్రహ ఆవిష్కరణకు పలువురు గురువులు వస్తున్నారని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.