ATP: జిల్లా వ్యాప్తంగా మహాత్మా జ్యోతి బాపూలె గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం ఇవాళ పరీక్ష నిర్వహించనున్నారు. ఆదివారం ఉ.10 నుంచి 12 గంటల వరకు కొనకొండ్ల, కుందుర్పి, గోనబావి, నార్పల, డి.హీరేహాళ్ కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుందని జిల్లా కన్వీనర్ అస్రత్ వలి తెలిపారు. విద్యార్థులు గంట ముందుగానే కేటాయించిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.