SS: కదిరిలోని బ్లూమూన్ విద్యాసంస్థల ప్రాంగణంలో నాలుగో రాష్ట్ర స్థాయి గోల్ షాట్ బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హాజరై జ్యోతిని వెలిగించి ఈ క్రీడలను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. క్రీడలు శారీరక దృఢత్వానికి, క్రమశిక్షణకు తోడ్పడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.