ASR: రాజవొమ్మంగి గ్రామ సచివాలయంలో ఎంపీడీవో యాదగిరేశ్వరావు మంగళవారం గ్రామసభను నిర్వహించారు. గ్రామంలో తాగునీటి సమస్యలు ఉంటే తెలపాలని ఆయన కోరారు. ముర్లవానిపాలెంలో తాగునీరు సమస్య నెలకొందని, చేతి పంపు ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరారు. వెంటనే స్పందించి సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు.