ELR: ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశానికి దిక్సూచి వంటి భారత రాజ్యాంగాన్ని రచించిన డా.బీ.ఆర్. అంబేద్కర్ ప్రపంచ మేధావి అని కలెక్టర్ కే. వెట్రిసెల్వి చెప్పారు. మంగళవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏలూరులో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలో అంటరానితనం, కుల వివక్షలపై రాజీలేని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.