ఉమ్మడి ప.గో. జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖలోని 29 బ్యాక్ లాగ్ ఉద్యోగాలకు ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకుడు రామ్ కుమార్ మంగళవారం తెలిపారు. గ్రూప్-4కు డిగ్రీ ఉత్తీర్ణత పొంది 18-52 ఏళ్లున్న వారు అర్హులని పేర్కొన్నారు. కార్యాలయానికి రాలేని వారు స్పీడ్ పోస్ట్ ద్వారా దరఖాస్తులను అందజేయాలని చెప్పుకొచ్చారు.